Ap House Sites 2025: ఇళ్ల స్థలాలు లేని వారికి గుడ్ న్యూస్
Ap House Sites 2025 :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును.. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.. ఎవరికి ఇస్తారు, ఎన్ని సెంట్లు ఇస్తారు.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Ap Cabinet Decisions
పేదలందరికీ ఇళ్ల పథకం పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
- పట్టణాల్లో 2 సెంట్లు,
- గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం
అర్హులకు కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
Ap House Sites 2025 కి ఎవరు అర్హులు
ఇళ్ల స్థలం అప్లై చేసుకోవాలనుకున్న లబ్ధిదారులకు తప్పనిసరిగా కింద చెప్పిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి.
- ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకునే వారు గతంలో ఇంటి కోసం లోను పొంది ఉండకూడదు.
- దారిద్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలు అయ్యి ఉండాలి.
- మెట్ట ప్రాంతంలో ఐదు ఎకరాలు..
- మగాన్ని ప్రాంతంలో 2.5 ఎకరాల మించి ఉండకూడదు.
- గతంలో ఎప్పుడు ఇళ్ల స్థలాలు పొంది ఉండకూడదు.
- మీరు గాని మీ కుటుంబంలో ఉన్న రేషన్ కార్డులో సభ్యులకు కూడా ఇప్పటివరకు ఎటువంటి స్థలం అనేది గవర్నమెంట్ నుంచి రాకుండా ఉండాలి.
కావలసిన డాక్యుమెంట్స్
మీరు ఇళ్ల స్థలం అప్లై చేసుకోవాలి అనకుంటే తప్పనిసరిగా ఈ క్రింద చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కావాలి.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- ఆదాయ ధృవీకరణ పత్రము
- కరెంట్ బిల్
- ఓటరు ఐ.డి. కార్డ్
- కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డుల నకళ్ళు .
- కుల ధృవీకరణ పత్రం
- వ్యక్తిగత బ్యాంకు ఖాతా మొదటి పేజి (ఆధార్ అనుసంధానం అయివుండాలి.)
- అంగవైకల్యము ఉన్నచో సంబంధిత సర్టిఫికేట్ మొదలగునవి జిరాక్స్ కాపీలు అర్జీకి జతపరచవలెను. జిరాక్స్ కాపీల నందు అర్జీ దారుని సంతకం చేయవలెను.
గమనిక :: లబ్ధిదారుని ఆధార్ కార్డు క మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ( అప్లై చేసే టైంలో లబ్ధిదారుని ఆధార్ కి OTP జనరేట్ అవుతుంది.)
గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు పరిస్థితి ఏంటి?
గతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారు ఇళ్ళు నిర్మించుకోక పోతే ఆ స్థలాలు రద్దు చేస్తాము. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని కాలనీలు నిర్మించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
దీంతో పాటు ఇళ్లపై సోలార్ ప్యానల్ ఉపయోగించాలని నిర్ణయించారు. కోర్టు కేసులు ఇల్లు కట్టనీ వారి స్థలాలు రద్దు చేస్తాము అని మంత్రి పార్థసారధి తెలపడం జరిగింది.
మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ఫిబ్రవరి ఒకటవ తేదీన గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తాం.. అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు..అర్హులందరికీ ఇళ్ళు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారధి అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గృహ నిర్మాణానికి ఆరు నెలల్లో రూ. 502 కోట్లు ఖర్చు చేసాం. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా. PMAY కింద మార్చిలోపు 7 లక్షలు ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నాము.
ఇల్లు లేని వారికి దరఖాస్తులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దరఖాస్తులయితే ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి.
కొత్త ఇంటి కొరకు దరఖాస్తు :: Click Here
ఇంటి స్థలం ఎలా అప్లయ్ చెయ్యాలి?
ఇకపోతే గతంలో అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వీఆర్వో గారికి, మరియు పూర్తి బాధ్యత ఎమ్మార్వో గారికి అప్పగించడం జరిగింది.. ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలు ఇంకా రాలేదు వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తాను.. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.
పదో తరగతి అర్హత తో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ :: Click Here
32,438 రైల్వే ఉద్యోగాలు రిలీజ్ :: Click Here
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here
📢 Related Tags
free house scheme, Ap house sites 2025, ap free house scheme, house site pattas, free house, ap new house scheme, free house scheme in ap, amaravathi house sites, ap free house scheme latest news, ap free house scheme status, ap house sites distribution, distribution of house sites, house sites pattas distribution, ap free house, house sites distribution latest news, house site patta
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇